Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (14:59 IST)
ఐటీ నగరం బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రియురాలిన ఓ హోటల్ గదికి తీసుకెళ్లి ప్రియుడు చంపేశాడు. ప్రియురాలి శరీరంపై కత్తితో 17 సార్లు పొడిచిన గాట్లు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఈ వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమై వుంటాయని పోలీసులు భావిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మృతురాలిని ఇద్దరు పిల్లల తల్లి హరిణి (33)గా గుర్తించారు. ఆమె కెంగేరిలోనే నివాసముంటున్న తన ప్రియుడు టెక్కీ అయిన యశస్ (25)తో కలిసి హత్య జరగడానికి రెండు రోజుల ముందు ఓయో హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన యశస్.. హరిణిపై కత్తితో దాడి చేశాడు. ఏకంగా 17 సార్లు పొడిచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో హరిణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
వ్యక్తిగత కారణాలు వారి మధ్య ఉన్న సంబంధంలోని సమస్యలే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, హత్యకు గల కారణాలపై లోతుగా విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments