ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (14:59 IST)
ఐటీ నగరం బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రియురాలిన ఓ హోటల్ గదికి తీసుకెళ్లి ప్రియుడు చంపేశాడు. ప్రియురాలి శరీరంపై కత్తితో 17 సార్లు పొడిచిన గాట్లు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఈ వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమై వుంటాయని పోలీసులు భావిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మృతురాలిని ఇద్దరు పిల్లల తల్లి హరిణి (33)గా గుర్తించారు. ఆమె కెంగేరిలోనే నివాసముంటున్న తన ప్రియుడు టెక్కీ అయిన యశస్ (25)తో కలిసి హత్య జరగడానికి రెండు రోజుల ముందు ఓయో హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన యశస్.. హరిణిపై కత్తితో దాడి చేశాడు. ఏకంగా 17 సార్లు పొడిచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో హరిణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
వ్యక్తిగత కారణాలు వారి మధ్య ఉన్న సంబంధంలోని సమస్యలే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, హత్యకు గల కారణాలపై లోతుగా విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments