Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (09:52 IST)
టీడీపీ పాలిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. నిమ్మతోటలో పనిచేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి చంపేసిన తర్వాత కూడా కసి తీరకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులు పాటు ముక్కలు ముక్కలుగా నరికి, ఆ శరీర భాగాలను బోరుబావిలో పడేశాడు. ఈ దారుణ హత్య నెల్లూరు జిల్లా లింగసముద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
లింగసముద్రం మండలం, జపాలవారి పాలెంకు చెందిన టీడీపీ నేత తోవూరి నరసింహం. ఈయనకు నిమ్మతోటవుండగా, అందులో బ్రహ్మయ్య అనే వ్యక్తి పని చేస్తున్నాడు. వీరిద్దరి ఏం జరిగిందో తెలియదుకానీ, నరసింహంను బ్రహ్మయ్య కత్తితో పొడచి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి బావిలోపడేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసింహం‌ను బ్రహ్మయ్య ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్నది మిస్టరీగా మారింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులుకేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. బోరుబావి వద్ద సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments