Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

వరుణ్
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:57 IST)
కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ట్రిపుల్ ఐటీలో ప్రకాశం జిల్లా కంభం మండలం, జంగుంట్ల గ్రామానికి చెందిన కుర్రి రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది.
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది సాయంతో ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, చివరి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా పూర్తికావడంతో మరో పది రోజుల్లో ఇంటికి వెళ్లాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, హాటల్ వార్డెన్ షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే, మృతురాలి మొబైల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments