Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డిలో కన్న కొడుకు ఘాతుకం... తల్లిని చంపి పాతిపెట్టిన తనయుడు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (13:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో దారుణం జరిగింది. కన్నతల్లిని చంపిన కిరాతకంగా చంపేసిన కుమారుడు.. శవాన్ని కూడా ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ (80) అనే వృద్ధురాలు ఉంది. ఈమె వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. దీంతో అన్ని రకాల సేవలతో పాటు సపర్యలను చిన్న కుమారుడు బాలయ్య చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో బాలయ్యకు సేవలు చేయలేక కన్నతల్లిని ఈ నెల 13వ తేదీన గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడుకాకుండా తల్లి శవాన్ని మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుకు ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, తన తల్లి అదృశ్యమైందంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
అయితే, చిన్న కుమారుడు బాలయ్యపైనే అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక ఎంపీటీసీ బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో మృతురాలు శవానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు నిజం తేలింది. ఈ కేసులో బాలయ్యను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments