Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డిలో కన్న కొడుకు ఘాతుకం... తల్లిని చంపి పాతిపెట్టిన తనయుడు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (13:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో దారుణం జరిగింది. కన్నతల్లిని చంపిన కిరాతకంగా చంపేసిన కుమారుడు.. శవాన్ని కూడా ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ (80) అనే వృద్ధురాలు ఉంది. ఈమె వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. దీంతో అన్ని రకాల సేవలతో పాటు సపర్యలను చిన్న కుమారుడు బాలయ్య చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో బాలయ్యకు సేవలు చేయలేక కన్నతల్లిని ఈ నెల 13వ తేదీన గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడుకాకుండా తల్లి శవాన్ని మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుకు ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, తన తల్లి అదృశ్యమైందంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
అయితే, చిన్న కుమారుడు బాలయ్యపైనే అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక ఎంపీటీసీ బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో మృతురాలు శవానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు నిజం తేలింది. ఈ కేసులో బాలయ్యను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments