Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డిలో కన్న కొడుకు ఘాతుకం... తల్లిని చంపి పాతిపెట్టిన తనయుడు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (13:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో దారుణం జరిగింది. కన్నతల్లిని చంపిన కిరాతకంగా చంపేసిన కుమారుడు.. శవాన్ని కూడా ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ (80) అనే వృద్ధురాలు ఉంది. ఈమె వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. దీంతో అన్ని రకాల సేవలతో పాటు సపర్యలను చిన్న కుమారుడు బాలయ్య చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో బాలయ్యకు సేవలు చేయలేక కన్నతల్లిని ఈ నెల 13వ తేదీన గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడుకాకుండా తల్లి శవాన్ని మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుకు ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, తన తల్లి అదృశ్యమైందంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
అయితే, చిన్న కుమారుడు బాలయ్యపైనే అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక ఎంపీటీసీ బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో మృతురాలు శవానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు నిజం తేలింది. ఈ కేసులో బాలయ్యను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments