Webdunia - Bharat's app for daily news and videos

Install App

Khammam: కోటీశ్వరుడు.. ట్రేడింగ్ పేరిట ట్రాప్ చేసి మిర్చితోటలో చంపేశారు.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 25 జనవరి 2025 (13:00 IST)
హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్‌ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. సికింద్రాబాద్‌లోని విక్రమ్‌పురిలో నివసిస్తున్న ఈ విద్యావేత్త, కోటీశ్వరుడు బొల్లు రమేష్, కాచిగూడలో జరిగిన కిడ్నాప్ తర్వాత హత్యకు గురయ్యారు. 
 
ఈ హత్య కేసులో బండ్లగూడకు చెందిన అహ్మద్ ఖాద్రీ అనే వ్యాపారవేత్త ప్రమేయం ఉందని అనుమానిస్తూ, రమేష్ భార్య కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది.
 
 దీనిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని కుసుమంచిలో రమేష్‌ను చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించిన ఖాద్రీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని కార్కానా పోలీసులు నిర్ధారించారు. మృతుడి చేతులను తాళ్లతో బిగించి దారుణంగా కొట్టి హత్యచేసినట్లు గుర్తించారు. మృతుడు బొల్లు రమేష్ ఏపీ, తెలంగాణ పాన్ మసాలా డీలర్‌గా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ట్రేడింగ్ పేరిట బొల్లురమేష్‌ను ట్రాప్ చేసి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

తర్వాతి కథనం
Show comments