Webdunia - Bharat's app for daily news and videos

Install App

Khammam: కోటీశ్వరుడు.. ట్రేడింగ్ పేరిట ట్రాప్ చేసి మిర్చితోటలో చంపేశారు.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 25 జనవరి 2025 (13:00 IST)
హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్‌ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. సికింద్రాబాద్‌లోని విక్రమ్‌పురిలో నివసిస్తున్న ఈ విద్యావేత్త, కోటీశ్వరుడు బొల్లు రమేష్, కాచిగూడలో జరిగిన కిడ్నాప్ తర్వాత హత్యకు గురయ్యారు. 
 
ఈ హత్య కేసులో బండ్లగూడకు చెందిన అహ్మద్ ఖాద్రీ అనే వ్యాపారవేత్త ప్రమేయం ఉందని అనుమానిస్తూ, రమేష్ భార్య కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది.
 
 దీనిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని కుసుమంచిలో రమేష్‌ను చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించిన ఖాద్రీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని కార్కానా పోలీసులు నిర్ధారించారు. మృతుడి చేతులను తాళ్లతో బిగించి దారుణంగా కొట్టి హత్యచేసినట్లు గుర్తించారు. మృతుడు బొల్లు రమేష్ ఏపీ, తెలంగాణ పాన్ మసాలా డీలర్‌గా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ట్రేడింగ్ పేరిట బొల్లురమేష్‌ను ట్రాప్ చేసి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments