Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాలు.. ఆలి.. కన్నబిడ్డను చంపేసి.. ఆతడూ ఆయువు తీసుకున్నాడు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:25 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక కష్టాలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. కట్టుకున్న భార్య, కన్నబిడ్డను చంపేసిన వ్యక్తి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి తోయపుట్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తోయపుట్‌కు చెందిన లింగరాజు బిశోయ్ (27) స్థానికంగా మొబైల్ షాపును నడుపుతున్నాడు. ఈయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. కుటుంబ జీవనం కోసం అప్పులు చేయసాగాడు. ఈ అప్పులు కూడా పెరిగిపోయాయి. దీంతో దిక్కుతోచనిస్థితిలో ఏం చేయాలో తెలియలేదు. తాను మాత్రమే ఆత్మహత్య చేసుకుంటే భార్యా, కుమార్తె ఒంటరివారే పోతారని భావించారు. 
 
అందుకే ముందుగా భార్య జ్యోత్స్న (24) మెడకు మొబైల్ చార్జర్ వైరు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ళ కుమార్తె గొంతుకు తాడు చుట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరుసటి రోజు వారి కదలికలు లేకపోవడంతో పొరుగింటివారు రాత్రి 9 గంటల సమయంలో వెళ్లి తలుపు తట్టారు. 
 
అయినప్పటికీ ఎలాంటి శబ్ధం లేకపోవడంతో గ్రామంలోని వారందరూ కలిసి తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఇంట్లో విగతజీవులై కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారమ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments