Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి మహిళ మోజులోనే గురుమూర్తి ఘాతుకం!

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (11:08 IST)
హైదరాబాద్ నగరంలోని మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య మాధవిను ముక్కలుగా నరికి, హీటర్ సాయంతో ఉడికించిన వైనం ఇటీవల సంచలనం సృష్టించింది. మరో మహిళ మోజులో పడి అతడు భార్యను కిరాతకంగా హతమార్చినట్టు భావిస్తున్నారు. ఇప్పుడా కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొమ్మిది రోజుల తర్వాత పోలీసులు ఈ కేసులో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. 
 
భార్యను చంపిన తర్వాత గురుమూర్తి... తన ఫ్రెండ్‌కు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టికెట్లు బుక్ చేసిన విషయం వెల్లడైంది. దాంతో, గురుమూర్తి స్నేహితుడుని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి హత్య విషయం ఆరా తీసినట్టు సమాచారం. 
 
ఇక, గురుమూర్తి భార్యను హత్య చేశాక ఎనిమిదిసార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. బడంగ్ పేటలో ఉన్న సోదరితో కూడా ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ మేరకు అతడి కాల్‌డేటా పరిశీలనలో వెల్లడైంది. డీఎన్ఏ రిపోర్టుతో పాటు, క్లూస్ టీమ్ నివేదిక కూడా వస్తే ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. 
 
బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా డీఎన్ఏ సేకరించారు. ఇంట్లో ఉన్న వస్తువులనే హత్యకు ఆధారాలుగా చూపించాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఓటీటీలో ఎంతో ప్రజాదరణ పొందిన 'సూక్ష్మదర్శిని' అనే సినిమా చూసి గురుమూర్తి ఈ హత్యకు ప్రణాళిక రచించినట్టు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments