Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (14:55 IST)
భార్యా బాధితులు ఎక్కువగా కర్నాటక రాష్ట్రంలోనే వున్నట్లుగా వరుసగా ఆ రాష్ట్రంలో భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరో విషాదకర సంఘటన జరిగింది. తన భార్య పింకీ వేధిస్తోందనీ, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె భర్త సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
ఈ విషాదకర పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని హుబ్బళ్లికి చెందిన పీటర్ తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమనీ, తన తల్లిదండ్రులు తను ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించమని వేడుకున్నాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు మాట్లాడుతూ... పీటర్, పింకీలకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవలే ఏదో విషయమై వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో గత 3 నెలలుగా ఇద్దరూ విడిగా వుంటున్నారు. పింకీ కారణంగా తన సోదరుడి ఉద్యోగం కూడా పోయింది.
 
పింకీ తనకు భరణంగా 20 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేయడంతో పీటర్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ బోరుమంటూ విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పీటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పింకీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments