Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (14:55 IST)
భార్యా బాధితులు ఎక్కువగా కర్నాటక రాష్ట్రంలోనే వున్నట్లుగా వరుసగా ఆ రాష్ట్రంలో భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరో విషాదకర సంఘటన జరిగింది. తన భార్య పింకీ వేధిస్తోందనీ, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె భర్త సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
ఈ విషాదకర పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని హుబ్బళ్లికి చెందిన పీటర్ తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమనీ, తన తల్లిదండ్రులు తను ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించమని వేడుకున్నాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు మాట్లాడుతూ... పీటర్, పింకీలకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవలే ఏదో విషయమై వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో గత 3 నెలలుగా ఇద్దరూ విడిగా వుంటున్నారు. పింకీ కారణంగా తన సోదరుడి ఉద్యోగం కూడా పోయింది.
 
పింకీ తనకు భరణంగా 20 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేయడంతో పీటర్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ బోరుమంటూ విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పీటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పింకీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments