గుంటూరులో వైద్య విద్యార్థిని దారుణ హత్య.. సర్జికల్ బ్లేడుతో దాడి..

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (22:56 IST)
గుంటూరులో దారుణం జరిగింది. ఓ వైద్య విద్యార్థిని హత్యకుగురైంది. ఆమె మాజీ ప్రియుడే సర్జికల్ బ్లేడుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రేమోన్మాది కూడా దాడి తర్వాత చేయి కోసుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సోమవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడకు చెందిన నిందితుడు జ్ఞానేశ్వర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈ టెక్కీకి గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది ప్రేమగా మారడంతో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంతలో వారి మధ్య మనస్పర్థలు చెలరేగడంతో అతన్ని తపస్వి దూరం పెట్టేసింది. 
 
ఈ క్రమంలో తక్కెళ్లపాడులోని ఓ దంత వైద్య కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేయసాగింది. ఇందుకోసం వారిద్దరినీ తన ఇంటికి పిలిపించింది. దీంతో తపస్వి గతం వారం రోజులుగా స్నేహితురాలి ఇంట్లోనే ఉంటోంది.
 
ఈ క్రమంలో తపస్విపై పగ పెంచుకున్న జ్ఞానేశ్వర్ ఆమెను హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు వారిద్దరి మధ్య మరోమారు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా, ఆ సమయంలో అతడు కోపోద్రిక్తుడై తపస్విపై సర్జికల్ బ్లేడుతో ఒక్కసారిగా దాడి చేశాడు. దీంతో పక్కనే ఉన్న స్నేహితురాలు బిగ్గరా కేకలు వేస్తూ బయటకు వెళ్లింది. 
 
ఇదే అదునుగా భావించిన జ్ఞానేశ్వర్.. తపస్విని ఇంట్లోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఇంతలో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి తపస్విని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరిలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ తపస్వి కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments