Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా కాల్చొద్దన్న యువకుడు.. కత్తితో పొడిచి చంపిన మైనర్లు...

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (09:57 IST)
ముంబై నగరంలో దీపావళి పండుగ రోజున ఓ దారుణం జరిగింది. టపాసులు పేల్చొద్దని చెప్పినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ యువకుడిని కొందరు మైనర్లు కలిసి కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై శివాజీ నగర్‌కు చెందిన 12 యేళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. దీన్ని గమనించిన పొరుగింటి యువకుడు సునీల్ శంకర్ నాయుడు (21) అలా కాల్చొద్దని వారించాడు. పైగా, అది చాలా ప్రమాదమని, గ్లాసు పేలి దాని ముక్కలు అందరికీ గుచ్చుకుంటాయని, అందువల్ల అలా కాల్చొద్దని వారించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఈ గొడవను చూసిన బాలుడు అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చాడు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవపడ్డారు. ఆ తర్వాత ఆగ్రహంతో వారంతా కలిసి శంకర్‌పై దాడిచేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ బాలుడు అన్న, అతడి స్నేహితుడుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు కారణమైన మైనర్ బాలుడు మాత్రం పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments