Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా స్కూల్ యజమానిని తమ్ముడు - మరదలు కలిసి చంపేశారు...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (19:32 IST)
ప్రొద్దుటూరులో పూజా పాఠశాల యజమాని రాజారెడ్డి మృతి కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు రాజారెడ్డి సోదరుడు, ఆయన మరదలేనని పోలీసులు తేల్చారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు చెప్పారు. ఈ వివరాలను ఏఎస్పీ శ్రవణ్ కుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, కడప జిల్లా ప్రొద్దుటూరులోని పూజా స్కూల్ యజమాని రాజారెడ్డి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపగా అసలు విషయం వెల్లడైందన్నారు. 
 
రాజారెడ్డిని ఆయన తమ్ముడు శ్రీధర్ రెడ్డి, మరదలు ప్రసన్న కలిసి హత్య చేశారని తెలిపారు. ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందన్నారు. ఈ నెల 11వ తేదీన హత్య జరిగిందని చెప్పారు. పాఠశాల ఆవరణలోనే గొంతునులిమి చంపేశారన్నారు. రాజారెడ్డిని హత్య చేసి, అనారోగ్యం అంటూ ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులకు డాక్టర్ వీరనాథ రెడ్డి కూడా సహకరించారని, ఈయన రాజారెడ్డికి గుండెపోటు వచ్చిందని సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పారు. ఈ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments