Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా స్కూల్ యజమానిని తమ్ముడు - మరదలు కలిసి చంపేశారు...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (19:32 IST)
ప్రొద్దుటూరులో పూజా పాఠశాల యజమాని రాజారెడ్డి మృతి కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు రాజారెడ్డి సోదరుడు, ఆయన మరదలేనని పోలీసులు తేల్చారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు చెప్పారు. ఈ వివరాలను ఏఎస్పీ శ్రవణ్ కుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, కడప జిల్లా ప్రొద్దుటూరులోని పూజా స్కూల్ యజమాని రాజారెడ్డి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపగా అసలు విషయం వెల్లడైందన్నారు. 
 
రాజారెడ్డిని ఆయన తమ్ముడు శ్రీధర్ రెడ్డి, మరదలు ప్రసన్న కలిసి హత్య చేశారని తెలిపారు. ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందన్నారు. ఈ నెల 11వ తేదీన హత్య జరిగిందని చెప్పారు. పాఠశాల ఆవరణలోనే గొంతునులిమి చంపేశారన్నారు. రాజారెడ్డిని హత్య చేసి, అనారోగ్యం అంటూ ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులకు డాక్టర్ వీరనాథ రెడ్డి కూడా సహకరించారని, ఈయన రాజారెడ్డికి గుండెపోటు వచ్చిందని సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పారు. ఈ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments