Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (19:46 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు వీడియో తీసి మళ్లీమళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. కర్నాటక రాష్ట్రంలోని బెళగావి ప్రాంతానికి చెందిన ఓ నిందితుడు ఓ బాలికకు మంచి స్నేహితుడు. ఆరు నెలల క్రితం తన స్నేహితుడు పిలవడంతో బాలిక అతనితో కలిసి ఓ కొండ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఆ 15 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను నిందితులంతా తమతమ ఫోన్లలో చిత్రీకరించారు. 
 
తమ మాట వినకపోతే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామంటూ బెదిరించి తాజాగా మరోసారి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈసారి కూడా ఈ కిరాతక చర్యను రికార్డు చేసి బెదిరింపులు కొనసాగించారు. దీంతో బాలిక శనివారం పోలీసులను ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, మిగిలిన పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments