Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న డ్రమ్ములో ఉన్నాడు... తండ్రి హత్యపై ఆరేళ్ళ పాప నోట నుంచి వచ్చిన నిజం..

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (14:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ హత్య కేసులో సంచలన నిజం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ళ కుమార్తె పుట్టిన రోజు కోసం లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన సౌరభ్... తన కన్నబిడ్డ ముందే కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. భర్త శవాన్ని 15 ముక్కలు చేసి ఓ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సమాధి చేశారు. కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య కేసు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఈ హత్యను కళ్ళారా ఆరేళ్ల చిన్నారి చూసింది. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు నాన్న డ్రమ్ములో ఉన్నాడు అంటూ సమాధానం చెప్పింది. ఆ మాటల వెనుకున్న విషాదం తెలియక ఆ చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా మిన్నకుండిపోయారు. కానీ, నిజంగానే ఆ పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేక పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments