Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐను కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (16:51 IST)
ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐ‌ను కాల్చి చంపేశాడు. ఈ దారుణం మణిపూర్ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో గత కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని రెండు తెగలకు చెందిన ప్రజల మధ్య ఈ ఘర్షణలు  చోటు చేసుకుంటున్నాయి. దీంతో పలు గ్రామాల్లో పోలీస్ పోస్టులు ఏర్పాటు చేసి హింస చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో జిరిబామ్ జిల్లా మాంగ్ బంగ్ గ్రామంలోని పోలీస్ పోస్ట్‌లో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్, ఎస్ఐ షాజహాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య శనివారం తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్ఐ కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిప్రాణాలు కోల్పోయాడు. 
 
తుపాకీ శబ్దం వినిపించిన మిగిలిన పోలీస్ సిబ్బంది బిక్రమ్ జిత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, కానిస్టేబుల్, ఎస్ఐల మధ్య కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments