Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భిణిని మంచానికి కట్టేసి నిప్పు పెట్టిన కసాయి భర్త!!

వరుణ్
ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (08:50 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భంతో ఉన్న కట్టుకున్న భార్యను మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడో ఓ కసాయి భర్త. భార్యాభర్తల మధ్య తీవ్రవాగ్వాదం తర్వాత క్షిణికావేశంతో భర్త ఈ దారుణానికి తెగబడ్డాడు. మరో మూడు నెలల్లో కవల పిల్లలకు జన్మినివ్వాల్సిన ఆ గర్భిణి అర్థాంతరంగా తనువు చాలించింది. అమృతసర్ నగరానికి సమీపంలోని బుల్లెనంగల్ గ్రామంలో ఈ దారుణం శుక్రవారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మృతురాలు పంకీ, భర్త సుఖేవ్ మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో సుఖేశ్ క్షిణికావేశంతో ఘోరానికి ఒడిగట్టాడు. పింకీ వయసు సంవత్సరాలు అని, ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అనంతరం పింకీని మంచానికి కట్టేసి నిప్పంటించాడని వివరించారు. సుఖ్‌దేవ్, పింకీల మధ్య విభేదాలు ఉన్నాయని, పలు విషయాలపై గొడవ పడేవారని పోలీసు అధికారులు చెప్పారు. 
 
శుక్రవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దారుణానికి ఒడిగట్టి సుఖ్‌దేవ్ పరారయ్యాడని అధికారులు వివరించారు. శనివారం సాయంత్రం సుఖ్‍‌దేవ్ అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ దారుణ ఘటనపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ కోరింది. ఈ ఘటనపై కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊహించలేని క్రూరత్వం ఇదని అభివర్ణించింది. ఈ ఘటనపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని పంజాబ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ లేఖ రాశారు. నేరస్థుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జాతీయ మహిళ కమిషన్ 'ఎక్స్' వేదికగా వివరాలను వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం