Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడపై నిద్రపోదామన్న భార్య.. ఆగ్రహంతో కుమార్తెను చంపేసిన భర్త... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 21 మే 2023 (10:02 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో దారుణం జరిగింది. ఇంటి మేడపై నిద్రపోదామన్నందుకు కట్టుకున్న భార్యపై కట్టుకున్న భర్త కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన 19 ఏళ్ల కుమార్తెను 17 సార్లు దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగింది. 
 
జిల్లాలోని కడోదరలో బిహార్‌కు చెందిన రామానుజ్ మహదేవ్ సాహు కుటుంబం నివసిస్తోంది. మహదేవ్ స్థానికంగా మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. గురువారం రాత్రి.. మహదేవన్ను అతడి భార్య రేఖాదేవి ఇంటి మేడపై నిద్రపోదామని అడిగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 
 
భార్యతో గొడవ జరిగిన తర్వాత మహదేవ్ సాహు.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత పదునైన కత్తితో వచ్చి రేఖాదేవిపై దాడికి యత్నించాడు. అదేసమయంలో తల్లిని కాపాడేందుకు కుమార్తె చంద్కుమారి వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన మహదేవ్.. ఆమెపై కత్తితో 17 సార్లు దాడి చేశారు. 
 
దీంతో చందకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి దాడిలో ముగ్గురు కుమారులు సూరజ్, ధీరజ్, విశాల్ కూడా గాయపడ్డారు. భార్యాపిల్లలపై దారుణానికి ఒడిగొట్టిన మహదేవ్.. ఘటన తర్వాత పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments