Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో కిరాతక చర్య : కండువా ఇవ్వలేదని భార్య హత్య

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (17:20 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. స్నానం చేసిన తర్వాత చేతికి కండువా ఇవ్వలేదన్న కోపంతో భార్యపై 50 యేళ్ల వ్యక్తి దాడి చేసి చంపేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ బహే (50) అనే వ్యక్తి అటవీ శాఖ అధికారిగా పని చేస్తున్నారు. రాజ్‌కుమార్ స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పా బాయి (45)ని అడిగాడు. కానీ ఆమె టవల్ ఇవ్వలేదు. ఇంటి పని చేస్తున్నట్టు సమాధానమిచ్చింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై పారతో పదే పదే కొట్టడంతో ఆమె అక్కడే ప్రాణాలు విడించింది. దీనిపై సమాచారం అందుకున్న కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 
 
కాగా, తల్లిపై తండ్రి దాడి చేస్తుండగా, 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను బెందిరంచాడని ఇన్‌స్పెక్టర్ చెప్పాడు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments