Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి అనుమానాస్ప‌ద మృతి... ఆ ఇద్ద‌రు యువ‌కులూ...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:05 IST)
ఒక లేడీ కానిస్టేబుల్‌కు కూడా వేధింపులు త‌ప్ప‌లేదు. ఇద్ద‌రు యువ‌కుల నిర్వాకంతోనే ఆమె మృతి చెందిందని గ్రామ‌స్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఉద్రిక్తత నెల‌కొంది.
 
 
మచిలీపట్నంలో ఇటీవల ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జిల్లేపల్లి ప్రశాంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యపై తల్లిదండ్రులు, సోమ‌వ‌రం గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రశాంతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
 
జిల్లేపల్లి ప్రశాంతిని హత్య చేసి, వారే పక్కా ప్రణాళికతో ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించడానికి వ‌చ్చార‌ని సోమవరం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆమె బంధువులు,  గ్రామస్తులు ఆ యువకులు ఇద్దరిని గృహ నిర్బంధం చేశారు. దీనితో పోలీసులు వ‌చ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. ఎఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి మృతిపై విచార‌ణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments