Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (17:39 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ వక్రమార్గంలో ప్రయాణించాడు. తన వద్ద చదువుకునే విద్యార్థిని గర్భవతిని చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా ఉండే ఓ కార్పొరేట్ పాఠశాలలో ఓ విద్యార్థిని కోచింగ్ కోసం చేరింది. ఆ యువతికి ఫిజిక్స్ పాఠాలు బోధించే లెక్చరర్ సైదులు ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఏకాంతంగా ఆ బాలికతో రాసలీలలు గడిపాడు. ఫలితంగా ఆ విద్యార్థిని గర్భందాల్చింది. 
 
అతనికి పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఈ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. తమ కుమార్తె గర్భవతి అయిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ నెల 24 నుంచి హైదరాబాద్ - బెంగూళూరుల మధ్య వందే భారత్ రైలు 
 
రైల్వే ప్రయాణికులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ - బెంగూళూరు ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ఈ నల 24వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది. ఈ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. 
 
కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్‌‍నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.45కు కాచిగూడ చేరుకుంటుంది.
 
కాగా, ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా మొత్తం 9 వందే భారత్ రైళ్ళను వర్చువల్‌ విధానంలో జెండా ఊపి ప్రారంభించనున్న విషయం తెల్సిందే. వీటిలో విజయవాడ - చెన్నై వందేభారత్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల‌్‌కు చేరుకుంటుంది. 
 
గురువారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం