భర్తకు మద్యం తాగించి.. రైలుపట్టాలపై పడుకోబెట్టి ప్రియుడితో హత్య చేయించిన భార్య

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (19:12 IST)
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను తన ప్రియుడితో హత్య చేయించింది. భర్తకు పీకల వరకు మద్యం తాగించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ(35) కూలిపనులకు వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య ఉప్పర వరలక్ష్మి గతేడాది జూన్‌ 30న మాధవరం ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
అయితే, మృతుడి ఫోన్ కాల్స్ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. నారాయణ రోజూ మద్యం తాగి భార్యను అనుమానిస్తూ, శారీరకంగా, మానసికంగా వేధించేవాడని విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో సి.బెళగల్‌ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్నగోవిందుతో వరలక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. 
 
దీంతో భర్త వేధింపులు భరించలేని ఆమె.. భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలిసి ఆమె ప్రణాళిక రచించింది. పథకం ప్రకారం చిన్నగోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకెళ్లి మద్యం తాగించి రైలుపట్టాలపై పడుకోబెట్టాడు. రైలు పైనుంచి దూసుకుపోవడంతో తలకు తీవ్రగాయాలై నారాయణ చనిపోయారు. చిన్నగోవిందు ఆ విషయాన్ని వరలక్ష్మికి ఫోన్‌లో చెప్పాడు. 
 
ఆ తర్వాత తమ ముందస్తు ప్రణాళికలో భాగంగా,  వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసుల విచారణలో తామే ఈ హత్య చేసినట్లు వరలక్ష్మి, చిన్నగోవిందు అంగీకరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరుపరచినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments