ప్రియుడి మోజులో పడి భర్తను చంపించిన భార్య!!

ఠాగూర్
మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (14:57 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తను హత్య చేయించింది. జిల్లాలోని ఆస్పరి మండలంలో ఈ దారుణం వెలుగు చూసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన పద్మావతి... అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమలో తన భర్తను హత్య చేయాలని ప్రియుడు చెన్నబసవను కోరింది. 
 
ప్రియురాలి మాటలతో హత్యకు సిద్ధమైన చెన్నబసవ.. ఇందుకోసం బెంగుళూరు నుంచి తొగలగల్లుకు వచ్చారు. పక్కా ప్రణాళికతో, సెప్టెంబరు 3వ తేదీన తొగలగల్లు, దొడకొండ గ్రామాలకు మధ్య ఉన్న డంపింగ్ యార్డు వద్ద ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడుని అహోబిలంగా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
ఈ విచారణలో భాగంగా భార్య పద్మావతిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతోనే హత్య చేసినట్టు వెల్లడించారు. పద్మావతి ఇచ్చిన సమాచారంతో ఆమె ప్రియుడు చెన్నబసవను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments