Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుందని రోకలిబండతో మోది చెల్లెలి హత్య ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (10:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఓ దారుణం జరిగింది. పొద్దస్తమానం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుందని ఆగ్రహించిన ఓ సోదరుడు.. సొంత చెల్లిని రోకలి బండతో మోది చంపేశాడు. ఆ తర్వాత రాయి తగలడంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులు పిలవడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇల్లెందు మండలంలోని రాజీవ్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజీవ్ నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్ ఉన్నారు. మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్ చేస్తున్న సింధు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇది సోదరుడికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో చెల్లితో తరచూ గొడవపడుతున్నాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 
 
ఈ క్రమంలో హరిలాల్ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ తీసుకెళ్తుండగా మృతిచెందారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని విచారణ చేపట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే హరిలాల్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments