మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (10:52 IST)
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఓ ఉపాధ్యాయుడుకి 111 యేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ శిక్షను విధించింది. అలాగే, 1.05 లక్షల అపరాధం కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో యేడాది పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.
 
గత 2019 జూలై రెండో తేదీన నిందితుడు మనోజ్ (44) ఐదేళ్ల క్రితం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసే విద్యార్థిని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడుపై ఏమాత్రం కరుణ చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి ఆర్ రేఖ పేర్కొంటూ 111యేళ్ళ జైలుశిక్ష విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. ఈ క్రమంలో ప్రత్యేక క్లాస్ పేరుతో బాధిత బాలికను ఇంటికి పిలిపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆ దారుణాని మొబైల్‌ ఫోనులో చిత్రీకరించాడు. తాజాగా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుదితీర్పును వెలువరిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం