Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (10:52 IST)
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఓ ఉపాధ్యాయుడుకి 111 యేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ శిక్షను విధించింది. అలాగే, 1.05 లక్షల అపరాధం కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో యేడాది పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.
 
గత 2019 జూలై రెండో తేదీన నిందితుడు మనోజ్ (44) ఐదేళ్ల క్రితం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసే విద్యార్థిని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడుపై ఏమాత్రం కరుణ చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి ఆర్ రేఖ పేర్కొంటూ 111యేళ్ళ జైలుశిక్ష విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. ఈ క్రమంలో ప్రత్యేక క్లాస్ పేరుతో బాధిత బాలికను ఇంటికి పిలిపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆ దారుణాని మొబైల్‌ ఫోనులో చిత్రీకరించాడు. తాజాగా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుదితీర్పును వెలువరిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం