Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటివారి గొడవతో మనస్తాపం - మహిళ ఆత్మహత్య - లారీ కింద పడి భర్త మృతి

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (14:14 IST)
పొరుగింటివారు గొడవపడ్డారు. దీన్ని చూసిన మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో మనస్తాపంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారంలో ఈ ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ రావు (31), శరణ్య (29) దంపతులు. పొరుగింటి వారితో జరిగిన గొడవతో మనస్తాపం చెంది ఈనెల 13న శరణ్య పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ శరణ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. 
 
ఆదివారం మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో.. లక్సెట్టిపేటలోని కరీంనగర్‌ చౌరస్తా వద్ద మల్లికార్జున్‌ రావు వస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌ అక్కడికక్కడే మృతిచెందారు. దంపతుల మృతితో వారి ఇద్దరి పిల్లలు అనాథలు మారారని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments