Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాచుపల్లి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (09:44 IST)
హైదారాబాద్ నగరంలోని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో దారుణం జరిగింది. దసరా సెలవుల తర్వాత కాలేజీకి వెళ్లిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే, కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తొలుత స్పృహతప్పినట్టుగా సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వచ్చాక చనిపోయిందని చెప్పారు. మృతురాలిని అనూషగా గుర్తించారు. 
 
అనూష దసరా సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి ఆదివారం కాలేజీ హాస్టల్‌కు వచ్చింది. తల్లిదండ్రులే ఆమెను హాస్టల్‌కు తీసుకొచ్చి వదలి వెళ్లారు. ఆ కాసేపటికే ఆమె స్పృహకోల్పోయిపడిపోయిందంటూ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోను చేసి సమాచారం చేరవేసింది. అప్పటికీ మృతురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ నగరం కూడా దాటలేదు. 
 
తమ కుమార్తె గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే తిరిగి రాగా, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులకు అనూష మృతదేహాన్ని అప్పగించగా, వారు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments