Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ప్రియుడిని రెండో ప్రియుడితో హత్య చేయించిన వివాహిత

Webdunia
గురువారం, 12 మే 2022 (09:29 IST)
ఓ వివాహిత చెడు మార్గం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. తన అక్రమ సంబంధం గుట్టు బయటపడుతుందని భయపడి తన తొలి ప్రియుడిని రెండో ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ కేసులో వారిద్దరితో హత్యకు సహకరించిన మరో వ్యక్తి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మీర్‌పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మీర్‌పేట ప్రశాంతి హిల్స్‌కు చెందిన 32 యేళ్ళ శ్వేతారెడ్డి అనే వివాహితకు ఫేస్‌బుక్ ద్వారా బాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్ (32) అనే వ్యక్తితో 2018లో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ముదిరిపాకనపాడటంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఓ రోజున తన ప్రియుడి కోరిక మేరకు శ్వేతారెడ్డి నగ్నంగా వీడియో కాల్ చేసింది. దీన్ని రికార్డు చేసిన యశ్మకుమార్... ఆ తర్వాత బెదిరింపులకు దిగాడు. 
 
తన అక్రమ సంబంధం గుట్టు బయటపడుతుందని ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో శ్వేతారెడ్డికి ఫేస్‌బుక్‌ ద్వారా కృష్ణా జిల్లా తిరుపూరుకు చెందిన అశోక్ (28) అనే వ్యక్తితో పరిచయమైంది. అయితే, తన మొదటి ప్రియుడి వేధింపుల విషయాన్ని అశోక్‌కు చెప్పింది. అశోక్ తన స్నేహితుడు కార్తీక్‌కు కలిసి ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 
 
అదే రోజు రాత్రి యశ్మకుమార్‌ను శ్వేతారెడ్డి ప్రశాంతి హిల్స్‌కు రప్పించి, రెండో ప్రియుడు అశోక్‌కు చేరవేసింది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న అశోక్ సుత్తితో యశ్మకుమార్ తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్వేతారెడ్డి తన ప్రియుడు అశోక్, కార్తీక్‌లతో కలిసి హత్య చేసినట్టు తేలడంతో ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments