Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (12:58 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం ఘటన ఒకటి చోటుచేసుకుంది. 16 యేళ్ళ మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారానికి పాల్పడింది. ప్రతి రోజూ ఆ యువతి పెట్టే వేధింపులను భరించలేని ఆ బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జూబ్లీహిల్స్‌లోని నివాసం ఉండే 28 యేళ్ళ ఓ మహిళ తన ఇంటి పక్కనే ఉండే 16 యేళ్ల బాలుడుతో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత తన ఇంటికి పిలిచి ఆ బాలుడుకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. ఇలా పలుమార్లు తన ఇంట్లోనే ఆ మైనర్ బాలుడుపై లైంగికదాడికి పాల్పడింది. ఈ విషయం బయటకు చెపితే తనపైనే అత్యాచారం చేశావని చెబుతానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 
 
అయితే, ఆ మహిళ నుంచి వేధింపులు మరింతగా పెరిగిపోవడంతో ఆ బాలుడు భరించలేకపోయాడు. పైగా, అసభ్యకరమైన పనులు చేయాలంటూ ఒత్తిడి చేయసాగింది. దీంతో వీటిని భరించలేని ఆ బాలుడు... తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments