Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది నెలల కూతురితో కలిసి తల్లి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 15 మే 2023 (09:34 IST)
అదనపు కట్నం కోసం అత్తింటివారు చేస్తున్న వేధింపులు తాళలేకపోయిన ఓ వివాహిత తన పది నెలల వయస్సున్న కన్నకూతురితో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రాంనగర్ బాకారంలో నివాసముంటున్న విజయ వసంతకుమారి, విద్యాసాగర్‌ అనే దంపతులకు పది నెలల కుమార్తె విద్యాధరణి అనే కుమార్తె ఉంది. విద్యాసాగర్ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి కాగా పెళ్లి అయిన నాటి నుంచి తల్లి, సోదరితో కలిసి భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 13న ఉదయం భార్యాబిడ్డలను ఇంట్లోనే ఉంచిన విద్యాం సాగర్.. తల్లిని తీసుకుని అక్క ఇంటికి వెళ్లాడు. విద్యాసాగర్ శనివారం అర్థరాత్రి తిరిగి ఇంటికి రాగా వసంత కుమారి తలుపు తీయలేదు. చుట్టు పక్కల వారి సహకారంతో తలుపులు తెరిచి చూడగా వసంతకుమారి, విద్యాధరణి విగతజీవులై కనిపించారు. 
 
తల్లీకూతుళ్లు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, అదనపు కట్నం కోసమే తన కూతురు, మనుమరాలిని విద్యాసాగర్ హత్య చేశాడని వసంతకుమారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments