Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (12:51 IST)
హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కుక్క ఇంటి యజమానిని చంపేసింది. అత్యంత ప్రేమగా చూసుకుంటూ వచ్చిన ఈ పెంపుడు కుక్క ఇంటి యజమానిని చంపడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టిస్తున్నాయి. 
 
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు... పవన్ కుమార్ అనే వ్యక్తి తన నివాసంలోనే మరణించివుండగా అతడి మృతికి పెంపుడు కుక్కదాడే కారణమని అనుమానిస్తున్నారు. మధురానగర్‌లో నివసించే కుమార్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నాడు. 
 
ఇటీవల పవన్‌ను కలిసేందుకు స్నేహితుడు సందీప్‌ అతడి ఇంటికి వెళ్లాడు. తలుపులు మూసి ఉండటంతో ఎంత పిలిచినా, తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సందీప్, బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పవన్‌ కుమార్‌ను చూసి షాక్‌‍కు గురయ్యారు. 
 
గదిలోనే ఉన్న పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉండటాన్ని సందీప్‌ను గమనించాడు. పవన్ కుమార్ శరీరంపై గాయాలు ఉండటం, కుక్క నోటికి రక్తం ఉండటంతో ఆ కుక్కే పవన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపి ఉంటుందని సందీప్ అనుమానం వ్యక్తం చేశాడు. కొన్ని శరీర భాగాలను కుక్క తినివేసినట్టు తెలుస్తోంది. వెంటనే సందీప్ మధురానగర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments