Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోతున్న భార్య గొంతుకోసి.. తలను ఠాణాకు తీసుకెళ్లిన కసాయి భర్త

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్‌లో దారుణం జరిగింది. నిద్రపోతున్న భార్యను కట్టుకున్న భర్త అతికిరాతకంగా గొంతుకోశాడు. తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరంలోని ఇమాద్ నగర్‌కు చెందిన సమ్రీన్ బేగం అనే అమ్మయిని ఫర్వేజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. అయితే భర్త వేధింపులు భరించలేని ఆమె విడాకులు తీసుకుంది. 
 
ఆ తర్వాత పెద్దల సమక్షంలో మళ్లీ రాజీకొచ్చిన ఫర్వేజ్.. సమ్రీన్‌ను మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. పైగా సమ్రీన్‌పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన ఫర్వేజ్... తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భార్య సమ్రీన్ గాఢ నిద్రలో ఉండగా ఆమె గొంతుకోశాడు. ఆ తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు తీసుకెళ్లాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఫర్వేజ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలికి వచ్చిన సమ్రీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమ్రీన్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments