Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థోస్కోపీ కోసం ఆస్పత్రికి వెళ్లిన కజకిస్థాన్ మహిళ.. మత్తులో ఉండగా అత్యాచారం...

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (08:27 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. కజకిస్థాన్ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆర్థోస్కాపి చేసుకునేందుకు ఆస్పత్రికి ఆ మహిళకు వైద్యులు మత్తు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ నెల 9వ తేదీన ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 9వ తేదీన కజకిస్థాన్‌కు చెందిన 51 యేళ్ల మహిళ హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఉన్న ఆర్టిమిస్ ఆస్పత్రి అనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోస్కోపీ చేసుకునేందుకు చేరారు. ఆమెకు 13వ తేదీన ఈ చికిత్స చేశారు. ఇందుకోసం ఆమెకు మత్తుమందు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకున్నారు. అదే అదునుగా భావించిన అటెండెంట్‌గా పని చేసే ఠాకూర్ సింగ్ (25) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి కుమార్తె ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేసింది. 
 
అదేసమయంలో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు స్పందిస్తూ, నిందితుడిని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడిస్తూ, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments