Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ వేళ విషాదం : సూర్యతాపం తట్టుకోలేక మృతి - ఆగిన పెళ్లి

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (09:32 IST)
బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంటిలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. ముహూర్త సమయానికి మరికొన్ని గంటలే ఉన్న సమయంలో వరుడు ఎండ వేడిని తట్టుకోలేక (వడదెబ్బ) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కొరటాల మండలం గుడ్లబోరి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన గుండ్ల శ్యాంరావ్ - యశోద దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమిలికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. బుధవారం గుడ్లబోరి జరగాల్సిన పెళ్శికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లి పనుల్లో నిమగ్నమైవున్న తిరుపతి మంగళవారం వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు లోనయ్యాడు. 
 
దీంతో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. కానీ, అక్కడ తగ్గకపోవడంతో సాయంత్రానికి మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగరులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో మంచిర్యాలలోని మరో ఆస్పత్రికి తరలించగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చనిపోయాడు. 
 
కాగా, గుడ్లబోరి గ్రామ సర్పంచిగా ఉన్న గుండ్ల శ్యామ్ రావ్ చిన్న కుమారుడు గత యేడాది అనారోగ్యంతోనే మృతి చెందాడు. ఇపుడు పెద్ద కుమారుడు కూడా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments