Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం పేరుతో మహిళకు గాలం.. 22 బంధించి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:58 IST)
ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళకు గాలం వేసిన ఓ వ్యక్తి.. ఆ మహిళను ఏకంగా 22 రోజుల పాటు గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌‌కు చెందిన ఒక వివాహితకు నదీమ్‌ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. అందుకోసం మహిళను జులై 7వ తేదీన తనతో పాటు హరిద్వార్‌కు తీసుకువచ్చాడు. తర్వాత మహ్మద్‌ షకీబ్‌ అనే వ్యక్తిని ఆమెకు పరిచయం చేశాడు. 
 
ఈ క్రమంలో షకీబ్‌ ఆమెకు మత్తు మందు ఇచ్చి బంధించాడు. 22 రోజుల పాటు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి అతడి భార్య అయేషా కూడా సహకరించింది. ఈ క్రమంలో బాధిత మహిళ ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ.. హరిద్వార్‌ వీధుల్లో తిరుగుతూ పోలీసుల కంటపడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
అనంతరం బాధితురాలి వివరాలు తెలుసుకున్నారు. ఆమె భర్తను పిలిపించి మాట్లాడించారు. దీంతో ఆమె అసలు విషయం బయట పెట్టింది. అనంతరం పోలీసులు ఆమెకి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments