Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (23:30 IST)
మేకలను పెంచడం అమ్మడం.. డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించడం ఇదే ఆ కుటుంబం పని. ఒకే ఒక్క కుమార్తె. ఆమెకు 13 యేళ్ళు. తండ్రితో పాటు ఆమె కూడా మేకలను మేస్తూ ఉండేది. అయితే ఎప్పటిలాగే మేకలను మేపడానికి వెళ్ళిన ఆ బాలికను కొంతమంది కిడ్నాప్ చేశారు. అతి క్రూరంగా బాలికపై అత్యాచారం చేశారు.

 
రాజస్థాన్ లోని భరత్ పూర్‌లో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. కోహ్ పోలీస్టేషన్ పరిధిలో నివాసముండే ఒక బాలిక గొర్రెలను మేపుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. మధ్యాహ్నం 2గంటల సమయం. ఐదుమంది యువకులు మూడు ద్విచక్రవాహనాల్లో అటువైపుగా వెళుతున్నారు.

 
అయితే వారికి ఈ బాలిక కనిపించింది. వెంటనే ఆమె నోటిని మూసివేసి ఎత్తుకెళ్ళారు యువకులు. సాయంత్రం అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంత వెతికినా బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు.

 
అయితే రెండురోజుల తరువాత బాలిక ఇంటికి వచ్చింది. రెండు రోజుల నుంచి 16 మంది యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఏడుస్తూ చెప్పింది. అంతేకాదు కనీసం తిండి కూడా పెట్టలేదని.. చిత్రహింసలకు గురిచేశారని చెబుతూ కన్నీంటి పర్యంతమైంది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు నిందితులను వెతికే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments