Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ అవగానే మాజీ మిస్ కేరళ, రన్నరప్‌లను తనతో రమ్మన్నాడు, కాదనేసరికి ఆడి కారులో...

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (16:03 IST)
నవంబరు 1వ తేదీ 2021న మాజీ మిస్ కేరళ అన్సీ, రన్నరప్ అంజనా షాజన్ ఇద్దరూ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలా దుర్మరణం చెందేట్లు వెంటాడాడు ఓ డ్రగ్ పెడ్లర్. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆరోజు ఓ హోటల్లో పార్టీ ముగియగానే వారిద్దరినీ తన కారులో రావాలంటూ ఆహ్వానించాడు. అందుకు వారు ససేమిరా అన్నారు.

 
దాంతో వారు ప్రయాణిస్తున్న కారును తన ఆడి కారులో వెంబడించి తరుమాడు. భయపడిపోయిన వాళ్లిద్దరూ కారు వేగాన్ని మరింత పెంచారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఓ సైక్లిస్టును తప్పించబోయే ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. ఇదంతా పోలీసుల విచారణలో తేలింది.

 
కాగా మాజీ మిస్ కేరళను, రన్నరప్ ఇద్దరినీ తరుముకుంటూ వచ్చిన వ్యక్తి సైజు థంక్‌చన్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇతడికి కొచ్చిలోని డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలున్నాయనీ, ఆ రోజు హోటల్లో కూడా పార్టీలో డ్రగ్స్ వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా హోటల్ యజమానితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మొత్తమ్మీద మాదక ద్రవ్యాల పెడ్లర్ కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments