Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ అవగానే మాజీ మిస్ కేరళ, రన్నరప్‌లను తనతో రమ్మన్నాడు, కాదనేసరికి ఆడి కారులో...

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (16:03 IST)
నవంబరు 1వ తేదీ 2021న మాజీ మిస్ కేరళ అన్సీ, రన్నరప్ అంజనా షాజన్ ఇద్దరూ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలా దుర్మరణం చెందేట్లు వెంటాడాడు ఓ డ్రగ్ పెడ్లర్. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆరోజు ఓ హోటల్లో పార్టీ ముగియగానే వారిద్దరినీ తన కారులో రావాలంటూ ఆహ్వానించాడు. అందుకు వారు ససేమిరా అన్నారు.

 
దాంతో వారు ప్రయాణిస్తున్న కారును తన ఆడి కారులో వెంబడించి తరుమాడు. భయపడిపోయిన వాళ్లిద్దరూ కారు వేగాన్ని మరింత పెంచారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఓ సైక్లిస్టును తప్పించబోయే ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. ఇదంతా పోలీసుల విచారణలో తేలింది.

 
కాగా మాజీ మిస్ కేరళను, రన్నరప్ ఇద్దరినీ తరుముకుంటూ వచ్చిన వ్యక్తి సైజు థంక్‌చన్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇతడికి కొచ్చిలోని డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలున్నాయనీ, ఆ రోజు హోటల్లో కూడా పార్టీలో డ్రగ్స్ వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా హోటల్ యజమానితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మొత్తమ్మీద మాదక ద్రవ్యాల పెడ్లర్ కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments