Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

ఐవీఆర్
శుక్రవారం, 28 మార్చి 2025 (14:52 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
భార్యకు ఉద్యోగం లేకపోవడంతో, తీవ్రమైన ఒత్తిడి- ఆందోళన కారణంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. హిటాచి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజరుగా వుంటున్న రాకేష్ అనే టెక్కీ, 32 ఏళ్ల భార్య గౌరిని కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో దాచిన ఘటన సంచలనం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన రాకేష్ గత ఏడాది బెంగళూరులో తన భార్య గౌరితో కలిసి వుంటున్నాడు. ఐతే గురువారం రాత్రి దంపతుల మధ్య చెలరేగిన వివాదం ఈ హత్యకు దారితీసినట్లు చెబుతున్నారు.
 
బాధితురాలిని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డకన్నమ్మనహళ్లి నివాసి అయిన 32 ఏళ్ల గౌరీ అనిల్ సాంబేకర్‌గా గుర్తించారు. నిందితుడిని 36 ఏళ్ల రాకేష్ రాజేంద్ర ఖేద్కర్‌గా గుర్తించారు. ఆమె మెడ, పొత్తికడుపులో కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మొత్తం శరీరాన్ని మడిచి ట్రాలీ బ్యాగులో కుక్కాడని పోలీసులు తెలిపారు. 
 
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా మాట్లాడుతూ, "ఈ జంట మహారాష్ట్రకు చెందినవారు. ఒక సంవత్సరం క్రితం బెంగళూరుకు మకాం మార్చారు. సూట్‌కేస్‌లో మృతదేహాన్ని కనుగొన్న తర్వాత ఇంటి యజమాని పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. మరణించిన మహిళ మాస్ మీడియాలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె భర్త రాకేష్ హిటాచి సంస్థలో పనిచేస్తున్నాడు. అతను ఇంటి నుండే పని చేస్తున్నాడు" అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments