Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోకలి బండతో కన్నతల్లిని కొట్టి చంపిన కుమార్తె

Webdunia
ఆదివారం, 28 మే 2023 (17:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కన్నతల్లిని కుమార్తె రోకలి బండతో దారుణంగా కొట్టి చంపేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన నాగం నర్సు (52) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. 
 
ఆమె భర్త 20 ఏళ్ల క్రితం చనిపోవడంతో ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లోనే ఒక గదిలో కుమార్తె నాగం హరిత(28) వేరుగా ఉం టోంది. తల్లి, కుమార్తె మధ్య గత కొన్నేళ్లుగా కుటుంబ విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం మృతురాలి రెండో కుమార్తె అరుణ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కి వచ్చిన వారిని నాగం నర్సు దుర్భాషలాడింది. ఆ విషయంలో మృతురాలికి, పెద్ద కుమార్తె హరితకు గొడవ జరిగింది. ఈ గొడవలో కుమార్తె తల్లిని రోకలి బండతో ఇష్టం వచ్చినట్లు తల, ముఖంపై కొట్టి పడేసి వెళ్ళిపోయింది. 
 
మరుసటి రోజు 27వ తేదీన జరిగిన విషయాన్ని మృతురాలి పెద్ద కుమార్తె తన చెల్లెలికి, బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. మధ్యాహ్నం మృతురాలి రెండో కుమార్తె, బంధువులు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments