Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ కి'లేడి' .. పెళ్లి పేరుతో టెక్కీని నిండా ముంచింది...

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (09:52 IST)
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు హెచ్చుమీరిపోతున్నాయి. ఈ తరహా నేరాలకు పాల్పడేవారిలో యువతులు కూడా ఉన్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ యువతి ఏకంగా రూ.95 లక్షలను దోచుకుంది. ఇది సికింద్రాబాద్ నగరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫేస్‌బుక్‌ ఖాతాకు అందమైన అమ్మాయి ముఖచిత్రంతో ఉన్న ఖాతా నుంచి మిత్ర విజ్ఞప్తి (ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌) రావడంతో అంగీకరించాడు. తాను ఏపీలోని గుంటూరులో ఉంటానని, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ వివరాలను చెప్పింది. 
 
ఆ తర్వాత వారిద్దరి మధ్య కొంతకాలం పాటు స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో మనసులు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంత జరిగినా బాధితుడు ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా చూడలేదు. 
 
మరోవైపు, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పడంతో విడతల వారీగా రూ.95 లక్షలు ఆమెకు ముట్టజెప్పాడు. అనంతరం ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌ ఖాతా డిలీట్‌ అయింది. ఫోన్‌లోనూ అందుబాటులో లేకుండా పోయింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments