సైబర్ కి'లేడి' .. పెళ్లి పేరుతో టెక్కీని నిండా ముంచింది...

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (09:52 IST)
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు హెచ్చుమీరిపోతున్నాయి. ఈ తరహా నేరాలకు పాల్పడేవారిలో యువతులు కూడా ఉన్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ యువతి ఏకంగా రూ.95 లక్షలను దోచుకుంది. ఇది సికింద్రాబాద్ నగరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫేస్‌బుక్‌ ఖాతాకు అందమైన అమ్మాయి ముఖచిత్రంతో ఉన్న ఖాతా నుంచి మిత్ర విజ్ఞప్తి (ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌) రావడంతో అంగీకరించాడు. తాను ఏపీలోని గుంటూరులో ఉంటానని, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ వివరాలను చెప్పింది. 
 
ఆ తర్వాత వారిద్దరి మధ్య కొంతకాలం పాటు స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో మనసులు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంత జరిగినా బాధితుడు ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా చూడలేదు. 
 
మరోవైపు, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పడంతో విడతల వారీగా రూ.95 లక్షలు ఆమెకు ముట్టజెప్పాడు. అనంతరం ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌ ఖాతా డిలీట్‌ అయింది. ఫోన్‌లోనూ అందుబాటులో లేకుండా పోయింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments