Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:00 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై మధురవాయల్ గంగై అమ్మన్ వీధికి చెందిన రాజా (33) అనే వ్యక్తి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య కలైసెల్వి (28) ఉండగా, వీరికి నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. యేడాది వయస్సుండే ధనీశ్వరన్ అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో రాజాకు స్థానికంగా నివసించే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు జరుగతున్నాయి. ఆదివారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో రాజా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి చూడగా వంట గదిలో కలై సెల్వి ఉరేసుకుని కనిపించింది. 
 
దీంతో ఆయన మధురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కలైసెల్వి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కమెడియన్ థర్టీ ఇయర్ ఇండస్ట్రీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!!

దేవర-పుష్ప2 ఒకే రోజున విడుదలవుతాయా? రూ.30కోట్ల నష్టం?

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబుతో రామ్ చరణ్- ఫోటో వైరల్

షణ్ముఖ్ జస్వంత్ తో న్యూ ఒరిజినల్‌ని అనౌన్స్ చేసిన ETV విన్

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం దేవకీ నందన వాసుదేవ షూటింగ్ పూర్తి

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

తర్వాతి కథనం
Show comments