అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే బహిష్కరణ

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (18:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన అధికార బీజేపీ ఎమ్మెల్యేను ఆ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. అత్యాచారం కేసులో కోర్టు జైలుశిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌పై ఈ చర్య తీసుకున్నారు. ఈయన గత 2014లో మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో 25 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది అసెంబ్లీ స్థానం నుంచి గోండ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోన్‌భద్రలోని ఎంపీ - ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జి అహ్సాన్ ఉల్లా ఖాన్ తాజాగా తీర్పును వెలువరించారు. ఈ కేసులో దోషి అయిన గోండుకు రూ.10 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. 
 
ఈ మొత్తాన్ని అత్యాచార బాధితురాలికి అప్పగించాలని ఆదేశించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు ఐపీసీ 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు ఎమ్మెల్యేను దోషిగా తేల్చి పాతికేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆయనను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

తర్వాతి కథనం
Show comments