Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ గిఫ్ట్‌గా ఇంటికి పంపించి.. స్మార్ట్‌గా రూ.2.8 కోట్లు స్వాహా

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (13:21 IST)
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్తగా ఆలోచన చేస్తున్నారు. అధునాత టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోనును బహుమతిగా పంపించి రూ.2.8 కోట్లను కాజేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు నగరానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్‌ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియరులో నిజంగానే మొబైల్ ఫోనును పంపించారు. 
 
కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్‌లోని సిమ్ తీసి కొత్త ఫోనులో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్‌లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోను కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు. 
 
అయితే, అప్పటికే ఆ ఫోనును తమ నియంత్రణలోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్‌వర్డ్‌లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments