ఫోన్ గిఫ్ట్‌గా ఇంటికి పంపించి.. స్మార్ట్‌గా రూ.2.8 కోట్లు స్వాహా

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (13:21 IST)
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్తగా ఆలోచన చేస్తున్నారు. అధునాత టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోనును బహుమతిగా పంపించి రూ.2.8 కోట్లను కాజేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు నగరానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్‌ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియరులో నిజంగానే మొబైల్ ఫోనును పంపించారు. 
 
కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్‌లోని సిమ్ తీసి కొత్త ఫోనులో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్‌లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోను కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు. 
 
అయితే, అప్పటికే ఆ ఫోనును తమ నియంత్రణలోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్‌వర్డ్‌లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments