Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి శవం పక్కనే రెండు రోజులు పాటు నిద్రపోయిన చిన్నారి...

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (13:12 IST)
కన్నతల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియని అభంశుభం తెలియని ఓ చిన్నారు.. రెండు రోజుల పాటు మృతదేహం పక్కనే పడుకున్నారు. తన తల్లి జీవించే ఉందన్న నమ్మకంతో ఆ బాలుడు ఆమె పక్కనే పడుకున్నాడు. పైగా, అమ్మ నిద్రపోతుందని అమ్మ వంట చేయలేదని చెప్పి, పక్కింటికి వెళ్లి ఆరగించి వచ్చాడు. చివరకు తల్లి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారికి చెప్పి సమాచారం అందించాడు. దీంతో ఆ ఇఁటిలోకి వారు వెళ్ళి చూసేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు సమీపంలోని గంగానగర్‌కు చెందిన అన్నమ్మ (40) అనే మహిళకు భర్త యేడాది క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తన 11 యేళ్ళ కుమారుడతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా అనారోగ్యంతో చనిపోయింది. అయితే, తల్లి చనిపోయిందన్న విషయాన్ని గ్రహించలేని ఆ బాలుడు.. తల్లిపక్కనే రెండు రోజుల పాటు నిద్రపోయాడు. ఆకలి వేసినపుడు అమ్మ వంట చేయలేదని పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేవాడు. తల్లిమృతదేహం నుంచి దుస్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments