Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి శవం పక్కనే రెండు రోజులు పాటు నిద్రపోయిన చిన్నారి...

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (13:12 IST)
కన్నతల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియని అభంశుభం తెలియని ఓ చిన్నారు.. రెండు రోజుల పాటు మృతదేహం పక్కనే పడుకున్నారు. తన తల్లి జీవించే ఉందన్న నమ్మకంతో ఆ బాలుడు ఆమె పక్కనే పడుకున్నాడు. పైగా, అమ్మ నిద్రపోతుందని అమ్మ వంట చేయలేదని చెప్పి, పక్కింటికి వెళ్లి ఆరగించి వచ్చాడు. చివరకు తల్లి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారికి చెప్పి సమాచారం అందించాడు. దీంతో ఆ ఇఁటిలోకి వారు వెళ్ళి చూసేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు సమీపంలోని గంగానగర్‌కు చెందిన అన్నమ్మ (40) అనే మహిళకు భర్త యేడాది క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తన 11 యేళ్ళ కుమారుడతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా అనారోగ్యంతో చనిపోయింది. అయితే, తల్లి చనిపోయిందన్న విషయాన్ని గ్రహించలేని ఆ బాలుడు.. తల్లిపక్కనే రెండు రోజుల పాటు నిద్రపోయాడు. ఆకలి వేసినపుడు అమ్మ వంట చేయలేదని పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేవాడు. తల్లిమృతదేహం నుంచి దుస్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments