అత్యాచారం యత్నం విఫలం: చంపేసి శవంపై అత్యాచారం చేసాడు

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:49 IST)
అత్యాచార యత్నం విఫలం కావడంతో మహిళను చంపి ఆమె శవంపై అత్యాచారం చేసాడు ఓ కామాంధుడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో జరిగింది. 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేయడంలో విఫలమైన తర్వాత 60 ఏళ్ల మహిళను హత్య చేశాడు. నిందితుడు మరణించిన మహిళ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఈ సంఘటన రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, 19 ఏళ్ల యువకుడు పూటుగా మద్యం సేవించి మహిళ ఇంటిలోనికి ప్రవేశించాడు. తొలుత మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను కొట్టి చంపేసి ఆ తర్వాత శవంపై అత్యాచారం చేశాడు.
 
మహిళ బావమరిది యువకుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. 60 ఏళ్ల వృద్ధ మహిళ ఒంటరిగా నివశిస్తోంది. ఆమెకి పిల్లలు లేరు. అర్థరాత్రి సమయంలో నిందితుడు కుమార్ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అఘాయిత్యం చేయబోగా ప్రతిఘటించడంతో మంచంపైకి తోసి గొంతు కోసి చంపేసాడు. ఆ తర్వాత అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. యువకుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments