Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (14:07 IST)
ఏటీఎం కేంద్రంలోని నగదును తన సొంతానికి వాడుకున్నాడు. ఈ నేరం బయటపడుకుండా ఉండేందుకు ఏకంగా ఏటీఎంనే తగలబెట్టేశాడు. ఆ తర్వాత అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు. అయితే పోలీసుల విచారణలో మాత్రం అసలు నిజం వెల్లడైంది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యానాం కొత్తబస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రం జులై 8న తెల్లవారుజామున మంటల్లో చిక్కుకుని కాలిబూడిదైంది. తొలుత ఇది ప్రమాదంగా భావించారు. అనంతరం పోలీసుల విచారణలో కుట్ర కోణం బయటపడింది. ఏటీఎంలో నగదు నింపే ఇద్దరు సిబ్బంది పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు గుర్తించారు. నాగాబత్తుల వెంకటేశ్ అలియాస్ బిట్టూ, వనమూరు అనిల్ బాబు రెండేళ్లుగా ఏటీఎంలలో నగదు నింపే విధుల్లో ఉన్నారు.
 
వీరు విడతల వారీగా రూ.12 లక్షలు స్వాహా చేశారు. సరైన ఆడిటింగ్ లేకపోవడంతో అధికారులు గుర్తించలేదు. ఈ వ్యవహారం ఎప్పటికైనా బయటపడుతుందని భావించిన ఆ నిందితులు.. ఆ రోజు ఉదయం నాలుగున్నర తర్వాత ఏటీఎం కేంద్రంలో 10 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఆ క్రమంలో ప్రధాన నిందితుడు బిట్టూ రెండు కాళ్లకూ మంటలు అంటుకోగా, పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని కారెక్కి పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దాని ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments