Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనీ భర్తను, అత్తను చంపి ముక్కలు చేసిన వివాహిత!

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (14:55 IST)
ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను మరిచిపోకముందే అలాంటి ఘటనే ఒకటి ఇపుడు అస్సాం రాష్ట్రంలో జరిగింది. పరాయి వ్యక్తితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉన్నారన్న అక్కసుతో కట్టుకున్న భర్తతో పాటు అత్తను కూడా హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. 
 
అస్సాం రాజధాని గౌహతికి సమీపంలోని నూన్‌మటి ప్రాంతానికి చెందిన వందన కలిత, అమర్ జ్యోతి దే అనే దంపతులు ఉన్నారు. అయితే వందనకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త, అత్త శంకరిదేవిలకు తెలియడంతో వారు వందనను హెచ్చరించారు. పైగా, ఆమె బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో తన ప్రియుడితో కలుసుకోకుండా చేసినందుకు ఆగ్రహించిన వందన.. భర్త, అత్తలను చంపేందుకు నిర్ణయించింది. 
 
ఈ విషయం తన ప్రియుడికి చెప్పగా అతను కూడా సమ్మతించాడు. ఆ తర్వాత ప్రియుడిసాయంతో భర్త, అత్తమాలను చంపేసి మృతదేహాలను ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. మూడు రోజుల తర్వాత వాటిని తీసుకెళ్లి మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి ప్రాంతంలో పడిసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments