Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (22:05 IST)
ఆ యువతికి 19 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటప్రాంత వాసి. పేరు హార్థిక. మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ మధ్యనే వివాహం కూడా జరిగింది. 

 
నిన్న సాయంత్రం ద్విచక్ర వాహనం నేర్చుకుంటానని ఇంటి నుంచి వెళ్ళింది. అంతే... రాత్రంతా కనిపించకుండా పోయింది. ఈరోజు మధ్యాహ్నం పిటిఎం మండలం క్రిష్ణాపురం గ్రామ సమీపంలోని పొలం వద్ద శవమై తేలింది వివాహిత.

 
బడికాయల పల్లికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే ఇద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో ఇంటి నుంచి పంపేశారు తల్లిదండ్రులు. భర్త ఇంటిలో ఉన్న సమయంలో హార్థిక నిన్న ద్విచక్ర వాహనంపై  నేర్చుకుంటూ వెళ్ళింది.

 
అయితే ఇంటికి తిరిగి రాలేదు. స్థానికంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి చూశాడు భర్త. చివరకు ఈరోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నానికి హార్థిక శవమై కనిపించింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది హార్థిక. అయితే ఇది అనుమానాస్పద మృతి కాదు హత్యేనంటున్నాడు హార్థిక భర్త. 

 
పరువు హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తల్లిదండ్రులే హార్థికను అతి కిరాతకంగా చంపేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాడు. ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక తరువాత పోలీసులకు విచారణ జరుపనున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments