Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్ డౌన్‌లోడింగ్‌లో జాప్యం.. కుమారుడిని కత్తితో పొడిచిన తండ్రి...

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (10:05 IST)
మొబైల్ ఫోనులో ఒక యాప్ డౌన్‌లోడ్ కావడంలో కాస్త జాప్యమైంది. దీంతో పట్టరాని కోపంతో కుమారుడిని ఓ కసాయి తండ్రి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురుగ్రామ్‌కు చెందిన అశోక్ సింగ్ (64) అనే వ్యక్తి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజరుగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఆదిత్య (23) కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ ఇటీవలే గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేశాడు.
 
ఈ క్రమంలో నగదు చెల్లింపుల కోసం మొబైల్ ఫోనులో ఓ యాప్ డౌన్‌లోడ్ చేయాలని భార్యకు చెప్పాడు. కానీ, డౌన్‌లోడింగ్‌లో జాప్యం జగుతుండటంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డుపడిన కొడుకును కత్తితో పొడిచాడు. 
 
ఫలితంగా ఆదిత్యను ఆస్పత్రిలో చేర్పించాల్సివచ్చింది. గాయాలకు చికిత్స చేసిన తర్వాత వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అశోక్ సింగ్‌‍పై మారణాయుధంతో కావాలని దాడికి దిగాడన్న సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments