Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కాబావా అంటూ ఆప్యాయంగా పలుకరించి చిన్నారిని చిదిమేసిన కామాంధుడు...

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (10:07 IST)
ఎలాంటి బంధుత్వం లేకపోయినప్పటికీ అక్కాబావా అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఇంటికి వచ్చిపోతుండేవాడు. చివరకు ఆ కామాంధుడే ఆ దంపతులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చి మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కేబీపురానికి చెందిన దంపతులకు మూడేళ్ళ కుమార్తె, యేడాదిన్నర కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ స్వగ్రామంలో పనులు లేకపోవడంతో పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం వడమాలపేట మండలంలోని అత్తారింటికి వచ్చారు. కొన్నాళ్లుగా అక్కడే కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. వీరి ఇంటికి సమీపంలోనే ఉంటున్న సుశాంత్ అలియాస్ నాగరాజు (23)కు తల్లిదండ్రులు లేరు. పెద్దనాన్న చెంచయ్య వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో అనేక చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో ఇంటి నుంచి గెంటేయడంతో చెంచయ్య కుమారుడు వెంకటేష్ వద్ద ఉండసాగాడు. 
 
ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ వరుసలు కలుపుతూ పిలిచేవాడు. శుక్రవారం మధ్యాహ్నం మద్యం సేవించిన నాగరాజు.. పాపకు చాక్లెట్లు కొనిస్తానని తల్లికి చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత కుమార్తె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అతడిని నిలదీయడంతో తనకు తెలియదని బుకాయించాడు. దీంతో ఆందోళన చెందుతూ ఊరంతా వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. 
 
చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత శవాన్ని పాఠశాల ఆట స్థలం వద్ద పక్కనే ఉన్న వంకలో పాతిపెట్టినట్టు చెప్పాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, హత్యకుగురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. హోం మంత్రి అనిత ఆదివారం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సాయం అందించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments