Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారూ... అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా: రియల్టర్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:42 IST)
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గిరిధర్ వర్మ అనే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు లోని కొరిటపాడుకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుంటూరుకి చెందిన వెంకటరెడ్డి నుంచి రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. పూర్తిగా డబ్బు చెల్లించినా ఇంకా తనకు డబ్బు ఇవ్వాలనీ, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని వెంకటరెడ్డి బెదిరిస్తున్నాడంటూ లేఖలో పేర్కొన్నాడు.

 
అతడి వేధింపులు తట్టుకోలేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాననీ, తనకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు. ఆ తర్వాత అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వర్మ మూడు నెలల క్రితం హైదరాబాదు కుషాయిగూడ లోని ఆదిత్యనగర్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని వుంటున్నాడు. బంధువులతో భోజనం చేసాక ఇంటికి వెళ్లి తెల్లారేసరికి చనిపోయి కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments