Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో ఒకే తాడుకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
బుధవారం, 12 జులై 2023 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేటలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ ప్రేమ జంట ఒకే తాడుకు ఉరేసుకుంది. ఈ విషాదకర ఘటన బుధవారం చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దుబ్బాకకు చెందిన మైనర్ బాలిక ఒకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు లచ్చాపేటకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ దుబ్బాకలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్నారు. 
 
అయితే, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమలో బుధవారం మైనర్ బాలుడి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఒకే తాడుకు వీరిద్దరూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరిద్దరూ ఉరితాడుకు వేలాడుతుండటాన్ని గుర్తించిన బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుబ్బాక ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments