Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో ఒకే తాడుకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
బుధవారం, 12 జులై 2023 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేటలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ ప్రేమ జంట ఒకే తాడుకు ఉరేసుకుంది. ఈ విషాదకర ఘటన బుధవారం చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దుబ్బాకకు చెందిన మైనర్ బాలిక ఒకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు లచ్చాపేటకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ దుబ్బాకలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్నారు. 
 
అయితే, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమలో బుధవారం మైనర్ బాలుడి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఒకే తాడుకు వీరిద్దరూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరిద్దరూ ఉరితాడుకు వేలాడుతుండటాన్ని గుర్తించిన బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుబ్బాక ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments